ఉద్యోగులకు షాక్.. సీల్డ్ కవర్ ఓ మాయ!

by  |
ఉద్యోగులకు షాక్.. సీల్డ్ కవర్ ఓ మాయ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : వేతన సవరణ కమిషన్​ సీఎస్‎కు ఇచ్చిన సీల్డ్​ కవర్​లో ఏముందనేదే ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. దీనిపై విస్తృతమైన సెటైర్లు సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వేతనాలు పెరుగుతాయని సీఎం కేసీఆర్​ ప్రకటించి 13 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు అతీగతీ లేదు. కనీసం దానిని ఎప్పుడు తెరుస్తారనేదాని మీద స్పష్టత కూడా లేదు.

సీఎం కేసీఆర్ గత నెల 30న ఉద్యోగసంఘాలతో భేటీ అయి​ పలు అంశాల గురించి చర్చించారు. పీఆర్సీ నివేదిక త్వరగా ఇవ్వాలని అదే రోజు ఆదేవించారు. దాని అధ్యయనం కోసం సీఎస్​ ఆధ్యక్షతన త్రీమెన్​ కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు. జనవరి మొదటి వారంలో స్టడీ చేయాలని, రెండో వారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని సూచించారు. మూడో వారంలో జోనల్​ విధానం, పదోన్నతులు, ఖాళీల భర్తీపైనా కేబినెట్​ భేటీ ఉంటుందని షెడ్యూల్​ చేశారు. ఈ నేపథ్యంలోనే బిస్వాల్​ కమిషన్ ఇంకా పీఆర్సీ నివేదికను సీల్డ్​ కవలో ఉంచి సీఎస్ కు అందజేసింది. దానిని ఇంత వరకూ ఓపెన్ కూడా​ చేయలేదు. అసలు సీల్డ్​ కవర్​లో ఏముందనేది ఇప్పటికీ తేలని అంశమే. దీనిపై ఉద్యోగ సంఘాలలో పలు రకాల ప్రచారం సాగుతోంది.

అందులో ఏం లేదు?

సీల్డ్​ కవర్​ను ఉద్యోగులు నమ్మం లేదు. అవన్నీ ఉత్తి కాగితాలేనని, అందులో ఎలాంటి నివేదికలు లేవని అంటున్నారు. సీఎం అత్యవసరంగా నివేదిక ఇవ్వాలని సూచించారని, అందుకే​ ఫిట్​మెంట్​, బెనిఫిట్స్​ తేల్చకుండానే నివేదిక ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. 31 నెలల పాటు అధ్యయనం చేసిన నివేదికను నాలుగైదు పేజీలలో ఇవ్వరని అంటున్నారు. కమిషన్​ పదవీకాలం కూడా డిసెంబర్​ 31తో ముగిసింది. నిజానికి ఇప్పుడే వేతన సవరణ నివేదికలు రెడీ చేస్తున్నారని, ఫిట్​మెంట్​, బెనిఫిట్స్​ రూపొందిస్తున్నారని, అందుకే సీఎస్​ కమిటీ భేటీ ఎటూ తేలడం లేదని ఉద్యోగవర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చించి, సీఎం కేసీఆర్​కు వివరించాల్సి ఉందని, అసంపూర్తి నివేదిక కారణంగానే ఆలస్యం అవుతోందనే ఆరోపణలున్నాయి. త్రీమెన్​ కమిటీ ఒకేసారి భేటీ అయింది. పీఆర్సీపై చర్చించలేదు. ఆ తర్వాత కమిటీలోని ఉన్నతాధికారులు తమతమ పనులలో నిమగ్నమయ్యారు. పీఆర్సీ భేటీకి సమయం కేటాయించడం లేదు. అసలు సీఎస్​ నుంచి సభ్యులకు సమాచారం కూడా అందడం లేదు. సీఎంకు ఇచ్చిన తర్వాతే సీల్డ్​ కవర్​ను ఓపెన్​ చేస్తామని సీఎస్​ చెబుతున్నారు. సీఎం​ కమిటీకి అప్పాయింట్​మెంట్​ ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

అప్పుడే సీఎంను కలిసి ఉంటే

వాస్తవంగా సీఎం కేసీఆర్​ను కలిసేందుకు పీఆర్ కమిషన్ కొద్ది నెలల కిందట నుంచే ప్రయత్నాలు చేస్తోందని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. సీఎంను కలిసి వినతులు, అధ్యయనంపై వివరించిన తర్వాతే నివేదిక సిద్ధం చేసేందుకు ప్లాన్​ చేసుకుందని అంటున్నాయి. సీఎం అప్పాయింట్​మెంట్​ లేకపోవడంతో నివేదికను ఎలా సిద్దం చేయాలనే సందిగ్థంలో పడిందని వివరిస్తున్నాయి. ఎంత మేరకు ఫిట్​మెంట్​ ఇవ్వాలి, ఏయే అంశాలను పరిశీలించాలనే విషయాలన్నీ సీఎంను కలిసిన తర్వాతే నివేదికలో పొందుపర్చాలని భావించారని, దీని గురించి కమిషన్​ నుంచి కూడా ఉద్యోగ సంఘాలకు సమాచారం కూడా అందిందనే ప్రచారం జరుగుతోంది. సీఎం ఉన్నఫళంగా అధ్యయనం రిపోర్టు ఇవ్వాలంటూ ఆదేశించడంతో వెంటనే ఓ సీల్డ్​కవర్​ను సీఎస్​కు అందించారని అంటున్నారు.

ఇంకా ఎప్పుడు మరి?

పీఆర్సీ నివేదిక గురించి ఈ నెల మూడో వారం వరకు వేచి చూడాల్సిందేనని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సోమవారం ప్రగతిభవన్​ నుంచి పిలుపు వస్తుందనే ఆశతో ఎదురుచూసిన ఉద్యోగులకు ఎలాంటి సమాచారం రాలేదు. నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్​ తర్వాత పిలుస్తారని భావించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్​ చాలా సమయం తీసుకుంటుందని, వీలుకాదంటూ ప్రగతిభవన్​ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ తర్వాత పండుగ వాతావరణం నెలకొంటుంది. సెలవుల అనంతరం మూడో వారంలో పీఆర్సీ నివేదిక అంశం తేలే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. సీఎస్​ కమిటీ సీఎంకు నివేదిక అందించిన తర్వాత, ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతుందని, ఆ తర్వాత సీఎం నుంచి ప్రకటన ఉండే అవకాశం ఉందంటున్నారు. సీఎం ప్రకటించిన షెడ్యూల్​ ఈ నెలలో పూర్తి అయ్యే అవకాశం లేదని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. ఈ నెలాఖరుకే వేతనాల పెరుగుదల, పీఆర్సీ అంశం, బదిలీలు, పదోన్నతులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించినా, ఇప్పుడు కష్టమేనని అంటున్నారు.


Next Story

Most Viewed