సహనం కోల్పోయి మాట్లాడాను….

by  |
సహనం కోల్పోయి మాట్లాడాను….
X

దిశ, వెబ్ డెస్క్:
జీవీఎంసీ అధికారిపై తాను చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ సబ్బం హరి వివరణ ఇచ్చారు. నిన్న సహనం కోల్పోయి మాట్లాడినట్టు తెలిపారు. ఆవేశంలో అధికారిపై అలాంటి వ్యాఖ్యలు చేశానని అన్నారు. ఆవేశంతో మాట్లాడినందుకు మన్నించమని కోరుతున్నానని తెలిపారు. తనపై కొన్ని అభియోగాలు వస్తున్నాయనీ, వాటిని పరిశీలించాలనీ నెల రోజుల క్రితమే కలెక్టర్‌కు లేఖ రాసినట్టు చెప్పారు.

కాగా సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు శనివారం కూల్చి వేశారు. అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రహరీ గోడను అధికారులు కూల్చివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేశంలో అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.



Next Story