మాజీ మంత్రి శ్రవణ్‌కు కరోనా

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: వరుసగా టీడీపీ నేతలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బుద్ధా వెంకన్నకు కరోనా సోకగా, తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత కిడారి శ్రవణ్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. శ్రవణ్ త్వరగా కోలుకోవాలని..దేవున్ని ప్రార్థించినట్లు లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా, శ్రవణ్ తన తండ్రి కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్యచేయడం.. తదనంతర పరిణామాలతో రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.</p>

మాజీ మంత్రి శ్రవణ్‌కు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: వరుసగా టీడీపీ నేతలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బుద్ధా వెంకన్నకు కరోనా సోకగా, తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత కిడారి శ్రవణ్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. శ్రవణ్ త్వరగా కోలుకోవాలని..దేవున్ని ప్రార్థించినట్లు లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా, శ్రవణ్ తన తండ్రి కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్యచేయడం.. తదనంతర పరిణామాలతో రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.

Next Story