మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసులు

by  |
kollu ravindra
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ మంత్రి పేర్ని నాని హత్యాయత్నం కేసు విచారణ కొనసాగుతోంది. ఈ హత్యాయత్నానికి సంబంధించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 91 సెక్షన్ కింద విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుడని నిర్ధారించిన కారణంగా మాజీ మంత్రిని వాటి వివరాలు ఉంటే సబ్మిట్ చేయాలని తెలిపారు.

నవంబర్ 29న మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నంపై నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో దాడికి యత్నించాడు. వెంటనే మంత్రి అనుచరులు అప్రమత్తమవడంతో పేర్ని నానికి తృటిలో ప్రమాదం తప్పింది. నిందితుడు నాగేశ్వరరావును పోలీసులు రెండు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో మచిలీపట్నం సబ్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు టీడీపీ ముఖ్య నేతలను పోలీసులు విచారించనున్నారు.

Next Story

Most Viewed