నష్ట పరిహారం అందివ్వాలి

by  |
నష్ట పరిహారం అందివ్వాలి
X

దిశ. నాగార్జునసాగర్:
భారీ వర్షాలతో పంట కోల్పోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి డిమాండ్ చేశారు. త్రిపురారం మండలంలో పలు గిరిజన ప్రాంతాల్లో దెబ్బ తిన్న వరిపంటలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాలతో నోటిదాకా వచ్చిన పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు చెప్పారు. పంటలు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.25వేలు తక్షణ సాయం అందించాలన్నారు. వారికి యాసంగి విత్తనాలు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed