నార్సింగిలో కాల్పుల కలకలం

by  |
నార్సింగిలో కాల్పుల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: నార్సింగిలో కాల్పుల కలకలం రేగింది. గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. నార్సింగిలోని హైదర్ష్ కోటలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగ మల్లేశ్ అనే మాజీ ఆర్మీ ఉద్యోగి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మల్లేశ్ ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న రివాల్వర్ ను స్వాధీం చేసుకున్నారు.



Next Story