కరోనా నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలి

by  |

దిశ, రంగారెడ్డి: మనిషికి మనిషి మధ్య సామాజిక దూరం ఉండేలా కరోనా నియంత్రణ కు ప్రతిఒక్కరూ సహకరించి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని కౌన్సిలర్ సోనా జయరాం తెలిపారు. మంగళవారం విద్యానగర్ కాలనిలో కాలనీ ప్రెసిడెంట్ పాషాతో కలిసి క్రిమి సంహరక పిచికారీ, మురుగు కాలువలను శుభ్రం చేయించారు. లాక్‌డౌన్ నిబంధనలను అనుసరిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అధికారులకు సమాచారం ఇవ్వాలని కరోనాపై అవగాహన కల్పించారు.

Tags : Everyone, contribute, corona control, RANGAREDDY



Next Story

Most Viewed