- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: ప్రతి పల్లె అభివృద్ధి చెందాలని ప్రభుత్వం కోరుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంకర్పల్లి పట్టణంలో మూడు కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు, ముబారక్ పూర్, గంగ్యడ గ్రామాల్లో రూ.4 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న చెక్డ్యాం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ముబారక్ పూర్లో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెక్ డ్యాం నిర్మాణాలతో పల్లె సీమలు పచ్చదనంతో కళకళలాడుతాయన్నారు. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీ చైర్ పర్సన్ అనితా రెడ్డి పాల్గొన్నారు.
Next Story