స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి విద్యార్థి కచ్చితంగా వాటి గురించి తెలుసుకోవాలి: పోలీస్

by  |
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి విద్యార్థి కచ్చితంగా వాటి గురించి తెలుసుకోవాలి: పోలీస్
X

దిశ, కూకట్‌పల్లి: సైబర్​నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బాలానగర్​ సీఐ వహీదుద్దిన్​అన్నారు. బాలానగర్​పోలీస్​స్టేషన్ ​ఆధ్వర్యంలో శుక్రవారం బాలానగర్​ ఫిరోజ్​గూడ లోని సదాశివ స్కూల్​లో సైబర్​నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వహీదుద్దిన్​మాట్లాడుతూ.. సమాజంలో చాలామంది సైబర్​ నేరాగాళ్లు చేతులలో మోసపోతున్నారని, తమకు తెలియకుండానే వారి కోరల్లో చిక్కుకుని తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. ప్రతి ఒక్కరి చేతులలో ఉన్న స్మార్ట్​ ఫోన్‌లనే టార్గెట్‌గా చేసుకున్న సైబర్​నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారన్నారు.

మనకు వచ్చే ప్రతి ఎస్‌ఎంఎస్​కు స్పందించ రాదని, ఎస్‌ఎంస్‌లలో వచ్చే లింక్‌లను ఓపెన్​చేయకూడదని చేప్పారు. ఆఫర్‌ల పేరుతో వెబ్​లింక్‌లతో కూడిన మేసేజ్‌లు పంపి వాటి ద్వారా మన సెల్ ఫోన్‌ను హ్యాక్​చేసి అకౌంట్‌లో నుంచి డబ్బులను కాజేస్తున్నారన్నారు. స్మార్ట్​ఫోన్​ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తమ క్రెడిట్ కార్డు, డెబిట్​కార్డు నంబర్‌లు, సివివి నంబర్‌లు, ఓటీపీలు ఎవరితో షేర్​చేయకూడదని సుచించారు.

Next Story

Most Viewed