ప్రతీ గ్రాడ్యయేట్ ఓటు వేయాలి

by  |
Home Minister Mahmood Ali
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే వారి సమస్యలను చట్ట సభల్లో వినిపించవచ్చని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవిని గెలిపించాలని కోరుతూ మౌలానా ఆజాద్ ఉర్థూ యూనివర్శిటీ, రామాంతాపూర్‌లలో హోం మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకావాలన్నారు. సమర్థవంతమైన ఎమ్మెల్సీని శాసనమండలికి ఎంపిక చేసుకుంటే నిరుద్యోగులతో పాటు ఉద్యోగుల, గ్రాడ్యుయేట్ల సమస్యలను కౌన్సిల్‌‌లో చర్చిస్తారని తెలిపారు.

Next Story

Most Viewed