ఆరోగ్య తెలంగాణ మా లక్ష్యం: ఈటల

by  |
ఆరోగ్య తెలంగాణ మా లక్ష్యం: ఈటల
X

దిశ, మేడ్చల్‌: తెలంగాణను దేశంలోనే ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా నిలిపేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వినికిడి దినోత్సవం సందర్భంగా కూకట్‎పల్లిలోని రావుస్ ఈఎన్‌టీ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు కిలోమీటర్ల నడక కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ.. శిశువు జన్మించిన వెంటనే ఆరోగ్య సమస్యలను గుర్తించే విధంగా నీలోఫర్ ఆస్పత్రిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే.. పరిష్కారం సులభం కావడంతో పాటు తక్కువ ఖర్చులో పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.



Next Story

Most Viewed