- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్: ప్రభుత్వం చెప్పిన పంటలను సాగు చేస్తే ప్రతి ఒక్క రైతు దండిగా సంపాదించడం ఖాయమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇలా చేస్తేనే రానున్న కాలంలో రైతులు ధనవంతులు అవుతారని హితవు పలికారు. కరీంనగర్ కలెక్టరేట్లో పంటల సాగుపై మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జలాలు కరీంనగర్ను ముద్దాడడంతో రైతులు సంతోషంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ, ఎల్.ఎం.డి ద్వారా చెరువులు నింపేందుకు తూములు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే, మిడ్మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టుల దిగువ భాగంలో ఎక్కడెక్కడ కాలువ పూడికతీత పనులు ఆగిపోయాయో.. అవి కూడా పూర్తి చేసి రైతులకు నీళ్లందిస్తామని ఈటల భరోసా ఇచ్చారు. ఏ సమయంలో ఏ పంట వేయాలో సీఎం సమావేశం తర్వాత స్పష్టత ఇస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మినిస్టర్ గంగుల కమలాకర్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.