భరతం పడుతాం.. కేసీఆర్‌కు ఈటల హెచ్చరిక

by  |
భరతం పడుతాం.. కేసీఆర్‌కు ఈటల హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లాల పర్యటనలు చేస్తుంటే కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని, ధాన్యం కొనుగోలు చేపట్టకుంటే కేసీఆర్ ​భరతం పడతామని హుజురాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ హెచ్చరించారు. కేంద్రం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతోందన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ కు డబ్బులు ఇవ్వకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed