- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వరంగల్: కరోనా వైరస్ నివారణకు చికిత్సనందిస్తున్న వైద్యుల సేవలు వెలకట్టలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. జనగామ ఏరియా ఆస్పత్రిలో వైద్యులకు సోమవారం పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ విధుల్లో పాల్గొంటున్న వైద్యుల సేవలను ప్రపంచం మరచిపోదని ప్రశంసించారు. అలాంటి వైద్యులకు ప్రజలు సహకరించాలని సూచించారు. కరోనా నిర్మూలన జరిగే వరకు సీఎం కేసీఆర్ చెప్పినట్టు పూర్తి లాక్డౌన్ పాటించాలన్నారు. అలాగే, వైద్యులకు పీపీఈ కిట్లను స్పాన్సర్ చేసిన గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎండీ చెలమశెట్టి అనిల్కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు.
Tags : Errabbelli Dayakar Rao, provided, PPE kits, doctors, warangal, cm kcr