- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముంబై : నీలి చిత్రాల చిత్రీకరణ కేసులో అరెస్టయిన తన భర్త రాజ్ కుంద్రా అమాయకుడని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తెలిపారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు జుహూలోని వీరి నివాసంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే శిల్పాశెట్టిని పోలీసులు విచారించారు.
రాజ్ కుంద్రా పోర్న్ కంటెంట్ను ‘హాట్షాట్స్’ అనే యాప్లో స్ట్రీమింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై స్పందిస్తూ, ఈ యాప్లో స్ట్రీమ్ అయ్యే కంటెంట్పై తనకు పూర్తి అవగాహన లేదని తెలిపారు. కానీ, ‘ఎరోటికా’, ‘పోర్నోగ్రఫీ’ రెండూ ఒక్కటి కాదని నొక్కిచెప్పారు. పోర్నోగ్రఫిక్ కంటెంట్ చిత్రీకరణలో తన భర్త ప్రమేయం లేదని, ఆయన అమాయకుడని వెల్లడించారు. ఈ మేరకు తన స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టు పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి.
48 టీబీల అడల్ట్ కంటెంట్ సీజ్
పోలీసులు శిల్పాశెట్టి, రాజ్కుంద్రా నివాసంలో చేసిన తనీఖీల్లో రూ.7.5కోట్లతోపాటు ఫొటోలు, వీడియోలతో కూడిన 48 టీబీల అడల్ట్ కంటెంట్ను సీజ్ చేశారు.