‘మీడియానే దోషిగా చిత్రీకరించింది’

by  |
‘మీడియానే దోషిగా చిత్రీకరించింది’
X

దిశ,వెబ్ డెస్క్ : పర్యావరణ ఉద్యమకారిణి దిశారవి మీడియా పై మండిపడ్డారు. నన్ను దోషిగా చిత్రకరించింది న్యాయస్థానాలు కాదు టీఆర్పీ కోసం పాకులాడే న్యూస్ ఛానళ్లు అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గ్రెటా థన్ బర్గ్ టూల్ కిట్ వ్యవహారంలో పర్యావరణ కార్యకర్త దిశారవి ఢిల్లీ న్యాయస్థానం అరెస్ట్ చేయగా తనకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దిశా రవి మీడియా పై సంచలన వ్యాఖ్యాలు చేసింది. టీఆర్పీల కోసం పాకులాడే ఛానెళ్లు నన్ను దోషిగా చిత్రీకరించాయన్నారు. న్యాయం దక్కక వేలాది మంది జైళ్లలో మగ్గిపోతున్నారని వారి కోసం మీ న్యూస్ చానళ్లు స్క్రీన్లు కేటాయించాలని ఆమె హితవు పలికారు.


Next Story