విశాఖ ఘటనపై కమిటీ

by  |
విశాఖ ఘటనపై కమిటీ
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామిక వాడ పరవాడలో రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ సంస్థలో గత రాత్రి చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై విచారణ జరిపేందుకు కలెక్టర్ వినయ్ చంద్ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి‌ నివేదిక ఇవ్వాలని ఆయన ఆ కమిటీలోని సభ్యులను ఆదేశించారు. డై మిథైల్ సల్ఫాక్సైడ్ వల్ల భారీ మంటలు చెలరేగినట్లు వినయ్ చంద్ ప్రకటించారు.

సాల్వెంట్స్‌ సంస్థలో వాల్వ్ దగ్గర శాంపిల్ తీసుకుంటున్నప్పుడు విద్యుత్ స్పార్క్ ఏర్పడి ఈ ప్రమాదం సంభవించిందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఆ సంస్థలో అర్హతలేని వ్యక్తి‌ కెమిస్ట్‌గా పని చేస్తున్నట్లు తమకు తెలిసిందని అన్నారు. అవగాహన లేని వారిని సంస్థలు పనుల్లో నియమించుకుంటున్నట్లు సంబంధిత అధికారులు అంటున్నారు. ఈనేపథ్యంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసినట్టు తెలిపారు.


Next Story