భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

by  |
భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్
X

దిశ, స్పోర్ట్స్: భారత జట్టుతో అగస్టు 4 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ తలపడనున్నది. ట్రెంట్‌బ్రిడ్జిలో తొలి టెస్టు జరుగనున్నది. కాగా, బుధవారం ఇంగ్లాండ్ అండే వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టెస్టు జట్టులోకి బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్‌ తరిగి వచ్చారు. న్యూజీలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వీరు దూరమయ్యారు. ఇక ఇండియాతో జరుగనున్న తొలి రెండు టెస్టుల 17 మందిలో హసీబ్ హమీద్, ఓలీ రాబిన్‌సన్ కూడా చోటు దక్కించుకున్నారు. గాయం కారణంగా ఫిట్‌నెస్ లేకపోవడంతో జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్‌కు జట్టులోస్థానం దక్కలేదు.

ఇంగ్లాండ్ జట్టు : జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాస్ బట్లర్, జాక్ క్రాలీ, సామ్ కర్రన్, హసీబ్ హమీద్, డాన్ లారెర్స్, జాక్ లీచ్, ఓలీ పోప్, ఓలీ రాబిన్‌సన్, డామ్ సిబ్లే, బెన్‌స్టోక్స్, మార్క్‌వుడ్



Next Story

Most Viewed