సోషల్ మీడియాను బాయ్‌కాట్ చేసిన ఇంగ్లాండ్..!

by  |
సోషల్ మీడియాను బాయ్‌కాట్ చేసిన ఇంగ్లాండ్..!
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులోని సభ్యులు సోషల్ మీడియాను బహిష్కించే అవకాశం ఉన్నట్లు ఆ జట్టు పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. జట్టులోని క్రికెటర్లు అందరూ ఆటగాళ్లపై ఆన్‌లైన్‌లో జరుగుతున్న దూషణలపై ఒక నిర్ణయానికి వస్తే సోషల్ మీడియాను బహిష్కరిస్తామని బ్రాడ్ చెప్పాడు. ఇటీవల ఇంగ్లాండ్ క్రికెటర్లు జోఫ్రా ఆర్చర్, మొయిన్ అలీపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని స్టువర్ట్ బ్రాడ్ తీవ్రంగా ఖండించి సహచర క్రికెటర్లకు మద్దతుగా నిలిచాడు. ‘సోషల్ మీడియా వల్ల ఎంతో మంచి జరుగుతున్నది. కానీ అదే సమయంలో అంతకు మించిన నెగెటివిటీ ప్రచారం అవుతున్నది. ఈ విషయంపై మా జట్టులోని క్రికెటర్లు అందరూ ఏకతాటిపై నిలబడి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంపై అందరూ కలసినప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడదామని అనుకుంటున్నాను. సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఇలాంటి దూషణలు కాస్తైనా తగ్గుతాయని బ్రాడ్ అంటున్నాడు.



Next Story

Most Viewed