దొంగనోట్ల చలామణిలో ఇంజనీరింగ్ విద్యార్థులు

by  |
దొంగనోట్ల చలామణిలో ఇంజనీరింగ్ విద్యార్థులు
X

దిశ, ఏపీ బ్యూరో : ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనయ్యారు. డబ్బుల కోసం తప్పుడు మార్గాలను అనుసరించారు. చివరకు దొంగనోట్లు చెలామణి చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. వారి నుంచి రూ.1.30లక్షలు సీజ్ చేశారు. దొంగనోట్లు చలామణి చేస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారి వెనుక ఎవరెవరు ఉన్నారు అన్నకోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed