ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

by  |
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం
X

దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విద్యాశాఖ సైట్ ఇంజనీర్ స్వామి నాయక్, పెద్దవూర మండలంలో ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో డ్రైనేజీ, పైపులైన్ల పనులకు సంబంధించిన టెండర్‌ నిర్వహించారు. ఈ టెండర్‌ను పెద్దమునగాల మాజీ ఎంపీటీసీ కేతావత్‌ సోమానినాయక్‌‌ దక్కించుకున్నారు. అయితే సోమానినాయక్ అనుకున్న సమయంలో పనులు పూర్తిచేశాడు. బిల్లు మంజూరు కోసం ఆర్వీఎం సైట్‌ ఇంజినీర్‌ స్వామినాయక్‌ వివరాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో సోమానినాయక్ నుంచి ఇంజినీర్ స్వామి నాయక్ రూ.లక్ష రూపాయల లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో మిర్యాలగూడ వన్‌టౌన్‌ సమీపంలో బాధితుడి నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా స్వామినాయక్‌ను పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ ఆనంద్‌ పాల్గొన్నారు.


Next Story

Most Viewed