ఎన్‌కౌంటర్ ఎఫెక్ట్.. బోర్డర్స్‌లో పోలీసుల గస్తీ

by  |
ఎన్‌కౌంటర్ ఎఫెక్ట్.. బోర్డర్స్‌లో పోలీసుల గస్తీ
X

దిశ, కాటారం: సరిహద్దు ప్రాంతాల్లో బలగాలు పహారా కాస్తున్నాయి. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‎లో కాల్పుల ఘటనలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర పారా మిలటరీ బలగాలు, స్థానిక పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పల్మెల పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని వంద కిలోమీటర్ల మేర గోదావరి తీరంలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోకి వచ్చే వారిని, వెల్లే వారందరిని కూడా చెక్ చేసిన తర్వాత లోపలికి, బయటకి వెళ్లడానికి అనుమతి ఇస్తున్నారు.

Next Story

Most Viewed