- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్:
వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ , అనుబంధ ఉద్యోగ సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ , పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు తమ ఒక్క రోజు మూల వేతనం రూ 33 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ద్వారా అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు ఉద్యోగ సంఘాల నాయకులకు అభినందనలు తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలకు మద్దతుగా ఉద్యోగులు పని చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Next Story