మండలి పోరు.. అమల్లోకి ‘కోడ్’

by  |
మండలి పోరు.. అమల్లోకి ‘కోడ్’
X

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి పోరుకు నగారా మోగింది. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ జారీ చేసింది. రాష్ట్రంలోని ఖమ్మం – వరంగల్‌-నల్గొండ, మహబూబ్‌నగర్‌ – రంగారెడ్డి -హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్‌ జరుగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్‌.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఏపీలోని ఉపాధ్యాయ నియోజకవర్గాలైన ఈస్ట్‌ గోదావరి-వెస్ట్‌ గోదావరి, కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, ఏఎస్‌రామకృష్ణ పదవీకాలం సైతం పూర్తి కానుంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం మహబూబ్​నగర్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ పట్టభద్రుల స్థానంలో మొత్తం 5,17,883 మంది ఓటర్లుండగా, 616 పోలింగ్​ కేంద్రాలన్నాయి. వరంగల్​– ఖమ్మం–నల్గొండ స్థానంలో 4,91,396 మంది ఓటర్లుండగా 546 పోలింగ్​ కేంద్రాలను తుది జాబితాలో ప్రకటించారు.

అమల్లో కోడ్..

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్​ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​ అమల్లోకి వచ్చింది. గురువారం ఉదయమే షెడ్యూల్​ సీఈసీ వెలువరించింది. దీంతో వెంటనే కోడ్​ అమల్లోకి వచ్చింది. కోడ్​ కారణంగా రాష్ట్రంలో పలు పథకాలు వాయిదా పడనున్నాయి. నల్గొండ జిల్లాకు మంజూరు చేస్తామని ప్రకటించిన నిధులు ఆగిపోయాయి. అదే విధంగా పంచాయతీలకు ప్రత్యేకంగా సీఎం నిధి నుంచి ఇచ్చే నిధులకు కూడా బ్రేక్​ పడింది.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

నోటిఫికేషన్‌ విడుదల : ఫిబ్రవరి 16 (మంగళవారం)
నామినేషన్లకు చివరితేదీ : ఫిబ్రవరి 23 (మంగళవారం)
నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 24 (బుధవారం)
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : ఫిబ్రవరి 26 (శుక్రవారం)
పోలింగ్‌ : మార్చి 14 (ఆదివారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
ఓట్ల లెక్కింపు : మార్చి 17 (బుధవారం)

Next Story

Most Viewed