పీవీ ఫోటోతో ఎన్నికల ప్రచారం సిగ్గుచేటు..

by  |
పీవీ ఫోటోతో ఎన్నికల ప్రచారం సిగ్గుచేటు..
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ టైం దగ్గరకు వస్తుండటంతో ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగుతున్నారు. ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో్ పీవీ ఫోటోతో టీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని అన్నారు.

ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలా చేస్తుందని విమర్శించారు. అంతేగాకుండా ఓటర్లను భయపెట్టి ఓట్లు వేయించునే కుట్ర జరుగుతోందని అన్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. పీవీ కూతురు వాణీదేవీకి రాజ్యసభ, గవర్నర్ కోటాలో పదవి ఇవ్వాలని సూచించారు.


Next Story

Most Viewed