ప్రచారం ముగిసింది..

by  |
ప్రచారం ముగిసింది..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 14న మండలి పోలింగ్​ జరుగుతుండటంతో… ఈసీ నిబంధనల ప్రకారం 48 గంటల ముందు ప్రచారం ముగించాల్సి ఉంది. దీంతో పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని ముగించారు. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ ప్రచారంలో పార్టీల తరుపున విస్తృతంగా పాల్గొన్నారు. మండలి పోరులో భాగంగా ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరుగనుంది. ఇప్పటికే మద్యం దుకాణాలను బంద్​ చేశారు. రెండు సెగ్మెంట్లలో అభ్యర్థులు భారీగా ఉండటంతో జంబో బ్యాలెట్​ను సిద్ధం చేశారు. పెద్ద బ్యాలెట్​ బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. రేపట్నుంచి పోలింగ్​ సామాగ్రిని కేంద్రాలకు తరలించనున్నారు.


Next Story

Most Viewed