పింఛన్ డబ్బులు ఇచ్చింది

by  |
పింఛన్ డబ్బులు ఇచ్చింది
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సాటి వారికి సాయం చేయాలంటనే జనాలు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏ ఆధారం లేకుండా పింఛన్ డబ్బులపై ఆధారపడి జీవిస్తున్న ఓ వృద్ధ మహిళ మానవత్వాన్ని చాటింది. తనకు వచ్చిన పింఛన్ మొత్తాన్ని ఇతరులకు సాయం చేసి ఉదారత్వాని చాటింది.

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన్నే గ్రామానికి చెందిన బోయ జమ్ములమ్మ ఈ సాయం చేసింది. ప్రభుత్వం నుంచి నెల నెలా వస్తున్న పింఛన్ డబ్బులు దాచుకుంది. అదే గ్రామానికి చెందిన అంజన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుసుకుంది. తన వద్ద ఉన్న రూ.10,000 లను ఆయనకు అందజేసి, అండగా నిలబడింది.


Next Story

Most Viewed