మరణంలోనూ వీడని బంధం.. గంట వ్యవధిలోనే..

by  |
మరణంలోనూ వీడని బంధం.. గంట వ్యవధిలోనే..
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్యభర్తల బంధం విడదీయలేనిది అంటారు. చివరిదాక తోడు ఉంటాను అంటూ పెళ్లిలో ప్రమాణం చేస్తారు. అయితే గుంటూరు జిల్లాలో పెళ్లిలో చేసిన ప్రమాణంను నిజం చేశారు ఓ జంట. మరణంలోనూ మూడు ముళ్లబంధంను విడవలేదు ఓ వృద్ధదంపతుల జంట. జిల్లాలోని మంగళ గిరిలో గంటల వ్యవధిలోనే వృద్ధదంపతులు మృతి చెందిన ఘటన అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. యర్రబాలెంకి చెందిన అక్కిరెడ్డి వీర్రాజు (85) , భార్య రాఘవమ్మ(69) భార్యభర్తలు. అనారోగ్యంతో భార్య రాఘవమ్మ మంగళవారం రాత్రి మృతి చెందింది. దాంతో భార్య మృతిని తట్టుకోలేని వీర్రాజు ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే వృద్ధదంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాధ ఛాయలు కమ్ముకున్నాయి.



Next Story

Most Viewed