పదవి ప్రజల భిక్షం.. ఈటల సంచలన వ్యాఖ్యలు

by  |
పదవి ప్రజల భిక్షం.. ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ ,కమలాపూర్: ఏ పదవులు అయినా ప్రజలు ఓట్లేస్తేనే వచ్చాయని, అది ప్రజల భిక్ష అని ఆదివారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం‌లోని ఉప్పలపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి జరిగే ఎన్నికలు చిన్న ఎన్నికలు కావని , రేపటి భవిష్యత్తు‌ను నిర్ణయించే ఎన్నికలని జోస్యం చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గం‌లో ఇచ్చే దళిత బంధు, గొర్రెల ఫంపిణి ,పింఛన్లు , కొత్త రేషన్ కార్డులు, రోడ్లు , సంక్షేమ పథకాలు ఈటల రాజేందర్ రాజీనామా ద్వారానే వస్తున్నాయని ప్రజలు మర్చిపోవద్దన్నారు. పథకాల రూపంలో ఇచ్చే డబ్బులు ప్రజలు కట్టే పన్నుల నుండే ఇస్తున్నారని , వారి సొంత ఇంట్లో నుండి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని, ప్రమాణాలు వేయిస్తే వేయకండని, ధర్మం తప్ప కూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed