మొదటి రోజు 30 మందికే వ్యాక్సిన్: ఈటల

by  |
మొదటి రోజు 30 మందికే వ్యాక్సిన్: ఈటల
X

దిశ,వెబ్ డెస్క్: ఈ నెల 16 నుంచి తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 3.60లక్షల డోసులు వచ్చాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 139 సెంటర్లలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలు ఇవ్వనున్నట్టు వివరించారు. మొదటి రోజు ఒక్కో సెంటర్‌లో 30 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మొదటి డోసు ఇచ్చిన తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తామని వెల్లడించారు. మొదట ప్రభుత్వ హెల్త్ కేర్ , తర్వాత ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్‌కు టీకా వేయనున్నట్టు తెలిపారు. తర్వాత రోజు 50, ఆ తర్వాత 100కు డోసుల సంఖ్య పెంచుతామని చెప్పారు.


Next Story

Most Viewed