ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. విద్యావలంటీర్ ఆత్మహత్య

by  |
educational volunteer Palakuri Shailaja
X

దిశ, నల్లగొండ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ విద్యావలంటీర్ రైలుకిందపడి ఆత్మ హత్యచేసుకుంది. నల్లగొండ జిల్లాకేంద్రానికి చెందిన పాలకూరి శైలజ విద్యావలంటీరుగా, ఆమె భర్త సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గత 15నెలలుగా పాఠశాలలు మూతపడటంతో పడటం, ఆమె భర్తకు కూడా ఉద్యోగం రెన్యూవల్ కాకపోవడంతో జీతాలు లేక వారు ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పూటగడవటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన శైలజ(30) నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలోకి వెళ్లి గుర్తుతెలియని రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శైలజ మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.


Next Story

Most Viewed