కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో విద్యాసంస్థలు బంద్

by  |
కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో విద్యాసంస్థలు బంద్
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలను మార్చి 31 వరకు బంద్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరగుతున్న పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. అటు సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ కమిటీ హాల్ లో కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Tags: carona virus, Educational institutions close, cm kcr, high level meeting, hyderabad

Next Story

Most Viewed