విద్యార్థులకు అలర్ట్: చివరి నిమిషంలో పరీక్షలు వాయిదా

by Disha Web Desk 2 |
విద్యార్థులకు అలర్ట్: చివరి నిమిషంలో పరీక్షలు వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు యూనివర్సిటీ పరీక్షల విభాగం ఊరట నిచ్చే నిర్ణయం తీసుకున్నది. ఇవాళ(30-09-2022) ఒకేరోజు ఎంబీఏ విద్యార్థులకు రెండు పరీక్షలు ఉండటంతో ఒకటి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఉన్న సమయంలోనే ఇవాళ యూజీసీ నెట్ నిర్వహిస్తోంది. దీంతో నేటి ఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తూ వర్సిటీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 11న నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు ఒకేరోజు ఉన్నటువంటి రెండు పరీక్షలను ఎలా రాయాలని ఆందోళన చెందిన విద్యార్థులు వర్సిటీ వర్సిటీ అనూహ్య నిర్ణయంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.



Next Story

Most Viewed