BREAKING:గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల

by Disha Web Desk 18 |
BREAKING:గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సారనికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) ద్వారా ప్రతి సంవత్సరం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూంటారు.

ఈ క్రమంలోనే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలు వారి ప్రవేశ అర్హతలను తెలియజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎంపికైన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉంటుంది.

Next Story

Most Viewed