ఈ మహిళలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకం!

by Ravi |   ( Updated:2025-05-10 00:30:20.0  )
ఈ మహిళలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకం!
X

పహెల్గాం దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్‌కు సిందూర్ అని నామకరణం చేసి పహెల్గాం దాడులలో జీవిత భాగస్వాములను కోల్పోయిన వారికి అంకితం చేసింది. అంతేకాకుండా ఇద్దరు మహిళలు కర్నల్ సోఫియా ఖురేషిపహెల్గాం దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్‌కు సిందూర్ అని నామకరణం చేసి పహెల్గాం దాడులలో జీవిత భాగస్వాములను కోల్పోయిన వారికి అంకితం చేసింది. అంతేకాకుండా ఇద్దరు మహిళలు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రధాన పాత్ర పోషించారు. సిందూర్ ఆపరేషన్‌కు ఇద్దరు మహిళలను ఎంచుకోవడం ద్వారా ఉగ్రవాదులు చేసిన దాడిలో ఒంటరైన మహిళల కోసం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకున్నటైంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగమైన ఈ మహిళలు భారత సైన్యంలో మహి ళల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన సోఫియా 1990లో సైన్యంలో చేరారు. సోఫియా తండ్రి, తాత కూడా ఆర్మీలో పని చేసినవారే. చిన్నప్పటి నుండి పైలట్ కావాలనే తపనతో పైలట్ అయ్యారు కమాండర్ వ్యోమికా సింగ్. చదువుకునే రోజుల్లో ఎన్‌సీసీలో చేరారు. ఇంజనీరింగ్ విద్య చేసిన వ్యోమికా సింగ్ 2019లో ఫ్లయింగ్ బ్రాంచిలో కమిషన్ హోదా పొందారు. అత్యంత కీలకమైన ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లు నడిపారు. వీరి ఇద్దరి ధైర్యం, పట్టుదల, సాహసం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుంది, దేశ సేవలో అసాధారణమైన ఔన్నత్యాన్ని చాటి చెప్తుంది.

-అజీజుద్దీన్ మహమ్మద్

70131 76656



Next Story

Most Viewed