- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుజాత మండల్పై ఈసీ కొరడా
by Shamantha N |
<p>కోల్కతా : బెంగాల్లో రాజకీయ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం చెల్లిస్తున్నారు. ఇటీవలే బెంగాల్ సీఎం దీదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఒక్కరోజు నిషేధం విధించిన ఈసీ.. ఆదివారం మరో ఇద్దరు నాయకులపైనా అటువంటి వేటే వేసింది. అందులో ఒకరు మమతా బెనర్జీకి సన్నిహితురాలైన టీఎంసీ నాయకురాలు సుజాత మండల్ కాగా.. మరొకరు బీజేపీ నాయకుడు సయంతన్ బసుపైనా 24 గంటల పాటు నిషేధం విధించింది. దళితులను అవమానకరంగా మాట్లాడారని సుజాత మండల్పై బీజేపీ ఫిర్యాదు […]</p>

X
కోల్కతా : బెంగాల్లో రాజకీయ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం చెల్లిస్తున్నారు. ఇటీవలే బెంగాల్ సీఎం దీదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఒక్కరోజు నిషేధం విధించిన ఈసీ.. ఆదివారం మరో ఇద్దరు నాయకులపైనా అటువంటి వేటే వేసింది. అందులో ఒకరు మమతా బెనర్జీకి సన్నిహితురాలైన టీఎంసీ నాయకురాలు సుజాత మండల్ కాగా.. మరొకరు బీజేపీ నాయకుడు సయంతన్ బసుపైనా 24 గంటల పాటు నిషేధం విధించింది. దళితులను అవమానకరంగా మాట్లాడారని సుజాత మండల్పై బీజేపీ ఫిర్యాదు చేయగా.. ‘మీరొక్కరిని చంపితే మేం నలుగురిని చంపుతాం’ అంటూ సయంతన్ బసు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
Next Story






