సుజాత మండల్‌పై ఈసీ కొరడా

by  |
సుజాత మండల్‌పై ఈసీ కొరడా
X

కోల్‌కతా : బెంగాల్‌లో రాజకీయ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం చెల్లిస్తున్నారు. ఇటీవలే బెంగాల్ సీఎం దీదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఒక్కరోజు నిషేధం విధించిన ఈసీ.. ఆదివారం మరో ఇద్దరు నాయకులపైనా అటువంటి వేటే వేసింది. అందులో ఒకరు మమతా బెనర్జీకి సన్నిహితురాలైన టీఎంసీ నాయకురాలు సుజాత మండల్ కాగా.. మరొకరు బీజేపీ నాయకుడు సయంతన్ బసుపైనా 24 గంటల పాటు నిషేధం విధించింది. దళితులను అవమానకరంగా మాట్లాడారని సుజాత మండల్‌పై బీజేపీ ఫిర్యాదు చేయగా.. ‘మీరొక్కరిని చంపితే మేం నలుగురిని చంపుతాం’ అంటూ సయంతన్ బసు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed