ఆ జిల్లాలో కంపించిన భూమి.. ఉలిక్కిపడిన ప్రజలు

by  |
ఆ జిల్లాలో కంపించిన భూమి.. ఉలిక్కిపడిన ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో ఆదివారం వేకువ జామున స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపిచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని మురళీ నగర్, బీచ్ రోడ్డు, కంచర పాలంలో ఈ భూప్రకంపనలు ఈ రోజు ఉదయం చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏ జరిగిందా అని అనుకునే లోపే ప్రకంపనలు నిలిచిపోయాయి, ఇంట్లో వస్తువులన్ని కిందపడిపోయి ఉన్నాయి. ప్రకంపనలు నిలిచిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు భూ ప్రకంపనలకు గల కారణాలు తెలుసుకుంటున్నారు.


Next Story

Most Viewed