ఢిల్లీలో భూకంపం.. దాని తీవ్రత ఎంతో తెలుసా..?

by  |
ఢిల్లీలో భూకంపం.. దాని తీవ్రత ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: హస్తినలో ఒక్కసారిగా భూమి కంపించింది. దేశ రాజధానితో పాటు ఆనుకోని ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్‌ గురుగ్రామ్‌లో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో భూకంపం సంభవించింది. కాగా, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదైంది. దాదాపు 3-4 సెకన్ల పాటు భూమి కంపించడంతో.. ఇళ్లలో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. గురుగ్రామ్‎కు 43 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు స్పష్టం చేశారు. మే 29న హర్యానాలోని రోహ్‌తక్‌లో 4.6 తీవ్రతతో సంభవించిందని ఆ ప్రకంపనలు ఢిల్లీని తాకినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతపై అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. కాసేపటి క్రితం ఢిల్లీలో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయని.. మీరంతా క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నా.. జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.

Next Story