విషాదం: ఈతకు వెళ్లి బాలుడు మృతి

by  |
విషాదం: ఈతకు వెళ్లి బాలుడు మృతి
X

దిశ, దుబ్బాక:

స్నేహితులతో ఈత కొట్టడానికి వెళ్లిన ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో చోటు చేసుకుంది. రామక్కపేటకు చెందిని కొట్టే ప్రవీణ్.. ఈతకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈత కొడుతున్న సమయంలో ప్రవీణ్ బావిలో నుండి ఎంతకీ రాకపోవడంతో స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed