- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, రేగొండ : పంచాయతీరాజ్ ఏఈని సస్పెండ్ చేయాలని డీవైఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి పసుల వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రేగొండ మండల పరిధిలో గ్రామపంచాయతీ పనుల విషయంలో ఏఈ.. బిల్లు చేయడంలో తీవ్రమైన అలసత్వాన్ని వహిస్తూ కమీషన్లు లేనిదే బిల్లులు చేయడం లేదని ఆరోపించారు.
ఎవరైనా బిల్లులు అడిగిన సందర్బంలో ఎవరు ఏం చేయలేరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అన్నారు. మండలంలోని గ్రామాల్లో ఉన్న సర్పంచ్లను కమీషన్ల పేరుతో నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని.. కమీషన్ లేనిదే ఫైల్ కదలటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఆయనపై విచారణ జరిపించి సస్పెండ్ చేయాలని లేకపోతే.. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మండల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హరీష్, తిరుపతి, వెంకటేష్, రాజు పాల్గొన్నారు.