పదోన్నతులు కల్పించాలని సీఎస్‌కు వినతి

by  |
పదోన్నతులు కల్పించాలని సీఎస్‌కు వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్పెషల్​గ్రేడ్​డిప్యూటీ కలెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి, అర్హులైన డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​కుమార్‌ను తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ కోరింది. మంగళవారం అధ్యక్షుడు కె.చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్‌‌రెడ్డి, కోశాధికారి ఎ.భాస్కర్‌రావు, ప్రతినిధి కె.చంద్రకళ వినతి పత్రం సమర్పించారు. ఆర్వోఆర్ చట్టాన్ని, ధరణి వెబ్​సైట్​, భూ రికార్డుల నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా, రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యుటేషన్ల విధానం ద్వారా రైతులకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. ఈ చారిత్రక నిర్ణయాన్ని తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తమ సంఘం తీర్మానించిన కోరికలను మానవత్వదృక్పథంతో పరిష్కరించాలని కోరారు.

సంఘం డిమాండ్లు
– వెయిటింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్​గ్రేడ్​డిప్యూటీ కలెక్టర్లకు తగిన పోస్టింగులు ఇవ్వాలి.
– అడహక్​పీరియడ్‌ను కూడా సర్వీసు పరిగణనలోకి తీసుకోవాలి.
– కమర్షియల్​ట్యాక్సుల శాఖలోని అదనపు కమిషనర్ల పేస్కేలును స్పెషల్​గ్రేడ్​డిప్యూటీ కలెక్టర్లకు వర్తింపజేయాలి.
– ఆర్డీఓలకు, అదనపు కలెక్టర్లకు రెసిడెన్షియల్​క్వార్టర్లు నిర్మించాలి.
– డిప్యూటీ కలెక్టర్లకు రొటేషన్ పద్ధతిలో ఆర్డీఓలుగా పని చేసే అవకాశాన్ని కల్పించాలి.



Next Story

Most Viewed