దౌల్తాబాద్ వ్యాపార కేంద్రంగా ఎదగాలి : ఎమ్మెల్యే రఘునందన్ రావు

by  |
దౌల్తాబాద్ వ్యాపార కేంద్రంగా ఎదగాలి : ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, దౌల్తాబాద్ : సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రం వ్యాపార, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు ప్రతీ ఒక్కరం కృషి చేద్దామని దుబ్బాక ఎమ్మెల్యే మాధవునేని రఘునందనరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో ఎస్‌ఆర్ ఎలక్ట్రికల్ దుకాణ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ సిద్దిపేట పట్టణాలకు దీటుగా దౌల్తాబాద్ మండల కేంద్రాన్ని అభివృద్ధి దిశగా పయనించేందుకు వ్యాపారస్తులు ముందుకు వచ్చి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి జరిగితే ఎంతో మంది కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. దౌల్తాబాద్‌లో ఎలాంటి వ్యాపారం ఏర్పాటు చేసినా నష్టాలు రాకుండా లాభాలు వచ్చే విధంగా ఉండటం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ మండల అధ్యక్షులు పోతరాజు కిషన్, ఉపాధ్యక్షులు గడ్డమీది స్వామి, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి యాదగిరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed