టీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆధిక్యం

by Shyam |   (  Updated:2020-12-18 04:49:45  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: టీఆర్ఎస్ పార్టీ ఆరు, ఏడో రౌండ్‌లో ఆధిక్యం ప్రదర్శించింది. బీజేపీ అభ్యర్థిపై 353 ఓట్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ముందంజలో ఉన్నది. లెక్కింపు జరిగిన ఆరు రౌండ్లలో టీఆర్ఎస్ ఐదు రౌండ్లలో వెనకబడి ఉండగా.. ఆరో రౌండ్‌లో 353 ఓట్లు అధికంగా పోలయ్యాయి. దీంతో బీజేపీ అభ్యర్థి ఆధిక్యానికి బ్రేక్ పడింది. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్‌లో టీఆర్ఎస్‌కు 846 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి 2,485 ఓట్ల ఆధిక్యంలో [&hellip;]</p>

టీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆధిక్యం
X

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: టీఆర్ఎస్ పార్టీ ఆరు, ఏడో రౌండ్‌లో ఆధిక్యం ప్రదర్శించింది. బీజేపీ అభ్యర్థిపై 353 ఓట్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ముందంజలో ఉన్నది. లెక్కింపు జరిగిన ఆరు రౌండ్లలో టీఆర్ఎస్ ఐదు రౌండ్లలో వెనకబడి ఉండగా.. ఆరో రౌండ్‌లో 353 ఓట్లు అధికంగా పోలయ్యాయి. దీంతో బీజేపీ అభ్యర్థి ఆధిక్యానికి బ్రేక్ పడింది. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్‌లో టీఆర్ఎస్‌కు 846 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి 2,485 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కాగా ఏడో రౌండ్‌లో బీజేపీకి 22,762, టీఆర్ఎస్‌కు 20,277, కాంగ్రెస్‌కు4,003 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు 52,055 ఓట్లను లెక్కించారు. నోటాకు 189 ఓట్లు పడ్డాయి.

Next Story