దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి

by  |
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రెండు రోజుల క్రితం పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డికే టికెట్‌ను ఖరారు చేయడానికి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదం తెలిపినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత కాంగ్రెస్ నేత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడైన శ్రీనివాసరెడ్డి మొన్నటివరకూ టీఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నియోజకవర్గంలో ముత్యంరెడ్డికి ఉన్న గుర్తింపు ఇప్పుడు కాంగ్రెస్‌కు కలసివచ్చే అంశం.



Next Story

Most Viewed