ఒక ఓటుకు 15 నిముషాలు..!

by  |
ఒక ఓటుకు 15 నిముషాలు..!
X

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో సిద్ధిపేట రాయపోల్ మండల కేంద్రంలో ఓటర్లు పడిగాపులుకాయాల్సి వచ్చింది. బూత్ నెంబర్ 194, 195లో ఈవీఎంలు మొరాయించాయి. అరగంటపాటు పోలింగ్ నిలిచిపోవడంతో రద్దీ పెరిగింది. భారీగా క్యూలైన్ పెరిగిపోవడంతో ఓటర్లు నిలబడి ఎదురు చూస్తున్నారు. కరోనా విజృంభణ ఉన్న నేపథ్యంలో రద్దీగా ఉన్న క్యూలైన్లో నిలబడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకరికి 15 నిముషాల సమయం పడుతుందంటూ ఆరోపిస్తున్నారు.



Next Story