పోలీసులు పర్యావరణ మిత్రులు: డీఎస్పీ

by  |
పోలీసులు పర్యావరణ మిత్రులు: డీఎస్పీ
X

దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో పోలీసులు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులను పర్యావరణ మిత్రులుగా అభివర్ణించారు. పర్యావరణ సంపదను పెంచేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులిగిల్ల ప్రకాశం చారి, సీఐ ప్రశాంత్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed