వారి మాటలే ఆధ్యాత్మికంగా ఉన్నాయి: డీఎస్పీ

by  |
వారి మాటలే ఆధ్యాత్మికంగా ఉన్నాయి: డీఎస్పీ
X

దిశ,వెబ్‌డెస్క్: మదనపల్లెలో జంట హత్యకేసులో పద్మజ-పురుషోత్తంలు నిజం ఒప్పుకున్నారు. తమ ఇద్దరు కూతుళ్లను హత్య చేసినట్టు వారు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో వారిని సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా పురుషోత్తం, పద్మజలు మానసికంగా బాగున్నారని డీఎస్పీ మనోహర చారి తెలిపారు. నిందితుల మాటలే ఆధ్యాత్మికంగా ఉన్నాయని చెప్పారు. విచారణ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన పోలీసులపై సస్పెన్షన్‌కు సిఫార్సు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Next Story

Most Viewed