పొంగుతున్న మురుగు.. జనం పరుగు

by  |
DRINAGE-1325
X

దిశ, వనస్థలిపురం: వనస్థలిపురం క్రాంతి హిల్స్ కాలనీలో డ్రైనేజీ పైప్ లైన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై కొన్ని నెలల నుంచి డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన రావడంతో ఆ పక్కనే ఉన్న బస్టాండ్ లో ప్రయాణికులు కూర్చోలేక పరుగు పెడుతున్నారు. అక్కడ బస్సుల కోసం వేచి ఉండలేకపోతున్నట్లు వాపోతున్నారు. ఐదు రూపాయల భోజనం తినే పేదలు, పలు అవసరాలరీత్యా పట్నం వచ్చే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed