సబ్బండ వర్గాలకు చెందిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్

by  |
Sunitha
X

దిశ, గుండాల: సబ్బండ వర్గాలకు చెందిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన రాసిన రాజ్యాంగ ఫలమే ఈ భారతావాణి అన్నారు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్యెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని పెద్ద పడిశాలలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. అంబేడ్కర్ కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తూచా తప్పక పాటించి, దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ సృష్టికర్తనే కారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, సర్పంచ్‌లు, దార సైదులు, పాల అబ్బులు, అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయం ఏర్పాటుకు సహకరిస్తా : బీర్ల

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వల్లనే మనం సుఖ సంతోషాలతో ఉంటున్నామని బీర్ల ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజక వర్గ ఇన్‌చార్జ్ బీర్ల ఐలయ్య అన్నారు. మండలంలోని పెడ్డపడిషాలలో అంబేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేడ్కర్ గొప్పతనాన్ని కొనియాడారు. పెడ్డపడిషాలలో గ్రంథాలయం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు.

Next Story