నీట మునిగిన డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు

by  |
నీట మునిగిన డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం :
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చండ్రుగొండ మండ‌ల‌ కేంద్రంలో ప్ర‌భుత్వం నిర్మిస్తున్న డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు పూర్తిగా నీట‌ మునిగాయి. దీంతో చండ్రుగొండ మండ‌లంలో క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి ప‌ర్య‌టించారు. డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లను ఆయన ప‌రిశీలించారు. సైట్‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చిన అధికారుల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌ర‌ద‌పోటుకు అవ‌కాశం ఉన్న‌చోట ఇండ్ల నిర్మాణానికి పూనుకోవ‌డం ఏంటంటూ మండిప‌డ్డారు. డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు నీట‌మునిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇదేనా ప్ర‌భుత్వ దూర దృష్టి అంటూ జ‌నాలు కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed